News May 24, 2024
నందికొట్కూరు: హంద్రీ కాలువలో పడి వ్యక్తి మృతి

నందికొట్కూరు మండలం వడ్డెమాను సమీపంలోని హంద్రీనీవా కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. ఎస్సై నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. దామగట్ల గ్రామానికి చెందిన గొల్ల మధు(40) కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక తిరుగుతున్నాడు. గురువారం వడ్డెమాను హంద్రీనీవా కాలువలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News March 5, 2026
పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.
News March 5, 2026
ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,742 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 10,305 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
News March 5, 2026
విందులు చేశారు.. పరిశుభ్రత మరిచారు!

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ ఛాంబర్ సమీపంలో కొందరు అధికారులు విందులు చేసి, ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేశారు. ప్రతీ శనివారం పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించే కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఇలా చేయడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. పది మందికి మంచి చెప్పాల్సిన అధికారులే నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


