News May 24, 2024
బాన్సువాడ: రేప్ చేసి.. చంపేశారు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716517916200-normal-WIFI.webp)
బాన్సువాడ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. వివరాలిలా.. మృతదేహంపై దుస్తులు చిందరవందరగా ఉండటం, పుర్రె పగిలి, దవడ విరిగి ఉంది. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP పోస్టుమార్టం నిర్వహించి కుంటుబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 12, 2025
NZB: మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేశారు: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739339154645_50139228-normal-WIFI.webp)
తమ అసమర్థతతో ఇప్పటికే గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం Xలో విమర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కి.మీ. నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News February 12, 2025
NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన DIEO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357285585_50486028-normal-WIFI.webp)
నిజామాబాద్లో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండో దశ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం DIEO రవికుమార్ తనిఖీ చేశారు. ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని స్వయంగా DIEO పరిశీలించారు.
News February 12, 2025
NZB: యాక్సిడెంట్లో వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355713649_50582768-normal-WIFI.webp)
వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ రమేశ్ పేర్కొన్నారు.