News May 24, 2024

కోనసీమ: కాలువలోకి దూసుకెళ్లిన చేపల వ్యాన్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని బొబ్బర్లంక-పల్లంకుర్రు పంట కాలువలోకి శుక్రవారం ఉదయం ఓ డీసీఎం దూసుకెళ్లింది. చెరువులో పట్టిన చేపలు తరలించేందుకు వచ్చిన డీసీఎం వ్యాన్ అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో డ్రైవర్‌తో పాటు వ్యాన్‌పై మరొక యువకుడు ఉన్నట్టు సమాచారం. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

Similar News

News October 6, 2024

సముద్రంలోకి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలు

image

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రానికి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అలాగే డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు.

News October 5, 2024

తూ.గో.జిల్లా టుడే టాప్ న్యూస్

image

*రాజమండ్రి కార్యకర్తకు మంత్రి లోకేశ్ భరోసా
*కాకినాడలో 8న మినీ జాబ్ మేళా
*పవన్ కళ్యాణ్ కాలయాపన చేస్తున్నారు: సీపీఐ
*అధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక
*రాళ్లపాలెం: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ
*డిప్యూటి సీఎంను కలిసిన మార్క్ ఫెడ్ డైరక్టర్ నరసింహరావు
*రాజమండ్రి: పుష్కరాలకు శోభాయమానంగా కోటిలింగాల ఘాట్
*తూ.గో.జిల్లా మహిళకు నారా లోకేశ్ హామీ
*గొల్లప్రోలు: ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

News October 5, 2024

బాధితుడు కోలుకునేందుకు సాయం చేస్తాం: మంత్రి లోకేశ్

image

కాలేయ సమస్యతో బాధపడుతున్న రాజమండ్రి రూరల్ కాతేరు వాసి సానబోయిన రాంబాబు కోలుకునేందుకు అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 1982 నుంచి పార్టీ విధేయుడిగా పనిచేస్తున్న రాంబాబు అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతని కుటుంబానికి సాయం చేయాలని జాహ్నవి స్వామి ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో లోకేశ్ స్పందించి కార్యకర్తలే పార్టీకి ప్రాణమని అతనికి అండగా నిలుస్తామన్నారు.