News May 24, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.17,200 పలికింది. అలాగే ఏసీ తేజ మిర్చి రూ.19,000 ధర, 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. కాగా నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు భారీగా తగ్గాయి. దీంతో రైతన్నలు కొంత నిరాశ చెందుతున్నారు.

Similar News

News September 30, 2024

మహిళలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి: ఎంపీ కావ్య

image

మహిళలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్లో కావ్య మాట్లాడుతూ.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, ఇలాంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలని లేకపోతే ప్రాణాంతకం అయి ప్రాణాలకే ముప్పు వస్తుందని హెచ్చరించారు. మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

News September 30, 2024

ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ కావ్య

image

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజురితో కలిసి వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఎంపీకి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 30, 2024

వరంగల్: ప్రజావాణికి భారీగా తరలి వచ్చిన ఫిర్యాదుదారులు

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి ఫిర్యాదులను సోమవారం కలెక్టర్ సత్య శారద స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 103 రాగా.. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకి సంబంధించి భూ సంబంధిత సమస్యలపై 53, జిల్లా విద్యా శాఖ, GWMCకి 6, వ్యవసాయ శాఖకి 5 దరఖాస్తులు వచ్చాయని, మిగతావి వివిధ శాఖలకు సంబంధించినవన్నారు.