News May 25, 2024

మదనపల్లెలో యువకుడు దారుణ హత్య

image

మదనపల్లిలోని రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి స్థానిక వైఎస్ఆర్ కాలనీలో శేషును ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్యచేసినట్లు ప్రాథమిక సమాచారం. యువకుడి హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న మదనపల్లి రెండో పట్టణ పోలీసులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 19, 2026

చిత్తూరు: ఇనామ్ భూములకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు

image

ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 6 వేల ఎకరాలకు విముక్తి కలగనుంది. చిత్తూరులో 358.91, తిరుపతిలో 1950.34 అన్నమయ్య జిల్లాలో 3929.95 ఎకరాల చొప్పున ఇనామ్ భూములు ఉన్నాయి. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

News April 19, 2026

చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలు

image

వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా గంగవరం మండలం ఆరంజ్ జోన్‌లో కొనసాగుతోంది. గంగవరంలో 41.2, తవణంపల్లెలో 40.4, శాంతిపురంలో 40.1, రొంపిచెర్లలో 40.0, శ్రీరంగరాజపురంలో 39.8, బంగారుపాళ్యంలో 39.4, నిండ్రలో 39.0, నగరిలో 38.8, పెద్దపంజాణి, పులిచెర్ల, వెదురుకుప్పంలో 38.6, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, యాదమరి, గంగాధర నెల్లూరు, పెనుమూరు, పాలసముద్రంలో 38.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది.

News April 19, 2026

చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలు

image

వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా గంగవరం మండలం ఆరంజ్ జోన్‌లో కొనసాగుతోంది. గంగవరంలో 41.2, తవణంపల్లెలో 40.4, శాంతిపురంలో 40.1, రొంపిచెర్లలో 40.0, శ్రీరంగరాజపురంలో 39.8, బంగారుపాళ్యంలో 39.4, నిండ్రలో 39.0, నగరిలో 38.8, పెద్దపంజాణి, పులిచెర్ల, వెదురుకుప్పంలో 38.6, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, యాదమరి, గంగాధర నెల్లూరు, పెనుమూరు, పాలసముద్రంలో 38.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది.