News May 25, 2024
IPL: రాజస్థాన్ ఆటగాడికి జరిమానా

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు షిమ్రాన్ హెట్మెయర్కు బీసీసీఐ ఫైన్ విధించింది. హైదరాబాద్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించడంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. కాగా అభిషేక్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాక హెట్మెయర్ స్టంప్స్ను బ్యాట్తో బాదేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అందుకే అతడికి జరిమానా విధించినట్లు సమాచారం.
Similar News
News March 13, 2025
మార్చి 13: చరిత్రలో ఈ రోజు

* 1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం
* 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
* 1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖెల్ డయ్యర్ను ఉద్దమ్ సింగ్ లండన్లో హతమార్చాడు
* 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ మరణం
* 1978: డైరెక్టర్ అనూషా రిజ్వీ జననం
News March 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 13, 2025
అవకాశమిస్తే రీఎంట్రీకి సిద్ధం: పుజారా

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెస్టు స్పెషలిస్ట్ పుజారా హింట్ ఇచ్చారు. జట్టుకు అవసరమైతే తాను ఆడేందుకు సిద్ధమని చెప్పారు. కొన్నేళ్లుగా డొమెస్టిక్, కౌంటీల్లో భారీగా పరుగులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసుల్లో టీమ్ ఇండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో పుజారాను తీసుకోవాలని అభిమానుల నుంచి డిమాండ్ వస్తోంది. 2023 WTC ఫైనల్ పుజారాకు ఆఖరు మ్యాచ్.