News May 25, 2024
దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలి: చంద్రబాబు

ఎన్నికల్లో ఓటమి ఖాయమవ్వడంతో విచక్షణ కోల్పోయిన వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం, 89పెద్దూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు.. దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. శేషాద్రి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.
Similar News
News December 31, 2025
చిత్తూరు: పింఛన్ల పంపిణీకి రూ.115 కోట్లు

చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ బుధవారం ఉదయం నుంచి మొదలైంది. జిల్లాలో 2,67,481 మందికి 27 రకాల పింఛన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ.115.17 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తారని పీడీ శ్రీదేవి తెలిపారు.
News December 30, 2025
పుంగనూరు: బైకును ఢీకొన్న RTC బస్సు.. ఒకరు స్పాట్ డెడ్

పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద పలమనేరు నుంచి పుంగనూరుకు వస్తున్న RTC బస్సు బైకును ఢీకొనడంతో గుడిసి బండకు చెందిన సోమశేఖర్(27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ అశ్వత్ నారాయణ, పోలీసు సిబ్బంది చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 30, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

రవి సీజన్లో పంటల సాగు జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటలకు అవసరమైన 2183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


