News May 25, 2024

మలేషియా మాస్టర్స్ ఫైనల్లో సింధు

image

తెలుగు తేజం పీవీ సింధు మలేషియా మాస్టర్స్ టైటిల్‌కు అడుగు దూరంలో ఉన్నారు. ఇవాళ సెమీఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ బుసానన్‌‌పై 13-21, 21-16, 21-12 పాయింట్ల తేడాతో ఆమె గెలుపొందారు. చైనా ప్లేయర్ వాంగ్ ఝీ యీతో రేపు ఫైనల్‌లో తలపడనున్నారు. గత ఏడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ ఫైనల్ చేరిన తర్వాత సింధుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్ గెలుచుకున్నారు.

Similar News

News November 6, 2025

ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి లాటరీ టికెట్‌ కొన్నాడు.. గెలవడంతో!

image

రాజస్థాన్‌లోని కోట్‌పూత్లీకి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా ‘పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ- 2025’లో రూ.11 కోట్లు గెలుచుకున్నారు. లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తన ఫ్రెండ్ దగ్గర రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. తాజాగా లాటరీ గెలవడంతో సెహ్రా కృతజ్ఞతగా స్నేహితుడి కుమార్తెకు రూ. కోటి బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బును ఇల్లు, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం వాడతానన్నారు.

News November 6, 2025

నఖ్వీపై తాడోపేడో తేల్చుకొనే పనిలో BCCI

image

దుబాయ్‌లో ఈనెల 7న జరిగే ICC మీటింగ్‌లో ACC అధ్యక్షుడు నఖ్వీపై తాడోపేడో తేల్చుకోవాలని BCCI నిర్ణయించుకుంది. ఆసియాకప్‌ విజేత ఇండియా టీమ్‌కు ట్రోఫీ అప్పగించకపోవడంపై నిలదీయనుంది. నఖ్వీపై పలు అభియోగాలనూ సిద్ధం చేసింది. పాక్ మంత్రిగా ఉన్న ఆయన ACC పదవికి అనర్హుడని, తప్పించాలని వాదించనుంది. దీనికి AFG బోర్డూ మద్దతు తెలిపే అవకాశముంది. కాగా ఈ భేటీకి నఖ్వీ గైర్హాజరు కావచ్చని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

News November 6, 2025

వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా: బండి

image

TG: జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం బోరబండకు వస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ‘ఎవరు అడ్డుకుంటారో చూస్తా. కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలి. సాయంత్రం BJP దమ్మేంటో చూపిద్దాం’ అని పిలుపునిచ్చారు. తన మీటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న ప్రచారం నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. అయితే తాము అనుమతి రద్దు చేశామనేది తప్పుడు ప్రచారమని, తమను ఎవరూ అనుమతే కోరలేదని పోలీసులు తెలిపారు.