News May 25, 2024

MBNR: పంట రుణాలపై సీఐడీ విచారణ !

image

రైతులు DCCB అచ్చంపేట బ్రాంచి నుంచి 2017-19 మధ్య కాలంలో తీసుకున్న పంట రుణాలపై CID అధికారులు విచారణ చేపట్టారు. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 1,827 మంది రైతులు DCCB నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ఖాతాలను ఆడిట్ చేసే క్రమంలో చెల్లింపుల్లో సుమారు రూ.10 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు గ్రామాల్లో ఖాతాల వారీగా రైతులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News November 10, 2025

MBNR: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

News November 10, 2025

MBNR: నీటి వనరుల గణనపై జిల్లా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

image

రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు, 7వ చిన్న నీటి పారుదల గణన, రెండో నీటి వనరుల గణన 2023-24 కోసం జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.

News November 10, 2025

MBNR: ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి స్వయంగా ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. ఆమె వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పర్యవేక్షిస్తామని ఎస్పీ తెలిపారు.