News May 25, 2024
ప్రధాని మోదీపై ప్రియాంక ఫైర్

పదవి మర్యాద పాటించాల్సిన అవసరం ప్రధాని మోదీకి లేదా? అని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫైరయ్యారు. బిహార్ సభలో ప్రధాని మోదీ అభ్యంతరకర <<13314526>>భాష<<>>ను ఉపయోగించారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో మోదీ అసలు స్వరూపం బయటపడిందని, దేశానికి ప్రతినిధి అనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఏ ప్రధాని అయినా ఇలాంటి పదాలు ఉపయోగించారా అని ప్రశ్నించారు.
Similar News
News November 16, 2025
తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

తిరుపతి బ్లిస్ హోటల్ పక్కన ఉన్న రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రుయా మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.
News November 16, 2025
శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232.
News November 16, 2025
‘ఇలా దీపం వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి’

రావి ఆకుపై ప్రమిదను ఉంచి, అందులో నువ్వుల నూనె పోసి, దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగిస్తే.. పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘రావి చెట్టు ఎంతో పవిత్రమైనది. దీన్ని పూజిస్తే శాపాలు, దోషాలు, గత జన్మ కర్మలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు కలగడానికి ఈ దీపం పెట్టాలి’ అని సూచిస్తున్నారు.


