News May 25, 2024
శ్రీకాకుళం: సజావుగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహణ చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం జరిగిన పరీక్షలకు 3,422 మంది హాజరు కావాల్సి ఉండగా 176 మంది గైర్హాజరై 3,246 మంది పరీక్ష రాశారని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 926 మంది హాజరు కావాల్సి ఉండగా 80 మంది గైర్హాజరై 846 మంది పరీక్ష రాశారని వారు పేర్కొన్నారు.
Similar News
News April 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

✮జలం-జీవంపై దృష్టి సారించాలి: కలెక్టర్
✮మెళియాపుట్టి: రోగులకు మెరుగైన సేవలందించాలి -ఐటీడీఏ పీఓ
✮శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు ఎంతమంది అంటే?
✮గ్రామ స్థాయిలో వైసీపీ బలోపేతమవ్వాలి: మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
✮టెక్కలి: బంగారం దుకాణాల్లో చోరీ.. దొంగ అరెస్ట్
✮సోంపేటలో ఈనెల 20న జాబ్ మేళా
✮ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బగ్గు వినతుల స్వీకరణ
News April 17, 2026
శ్రీకాకుళం: 912 పంచాయతీల్లో ఓటర్లు ఎంతమందంటే?

స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అన్ని పంచాయతీల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. జిల్లాలో 912 పంచాయతీలు ఉండగా, 16,22,067 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు జిల్లా పంచాయతీల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పారదర్శక ఓటర్ల జాబితా కూర్పుపై ఎన్నికల సంఘం కసరత్తు పెట్టింది.
News April 17, 2026
జనగణనపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

జనగణనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. స్వీయ-గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. దేశానికి స్వీయ గణన ఎంతో అవసరమన్నారు. మొబైల్ యాప్ (టెక్నాలజీ) వాడుకొనే జనగణనాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.


