News May 25, 2024

అది ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రశ్నలా ఉంది: ఖర్గే

image

కూటమి నుంచి PM అభ్యర్థి ఎవరనే బీజేపీ నేతల ప్రశ్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌లోని క్వశ్చన్‌లా ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే నేతలంతా కలిసి పీఎం ఎవరో నిర్ణయిస్తారని చెప్పారు. 2004-14లో అధికారంలో ఉన్న UPA ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని గుర్తు చేశారు. 2 కోట్ల ఉద్యోగాల పేరుతో BJP దేశ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.

Similar News

News October 29, 2025

టుడే హెడ్‌లైన్స్

image

* AP: తీరాన్ని తాకిన మొంథా తుఫాను.. నెల్లూరులో 16.3 సెం.మీ. వర్షపాతం
* తుఫాన్ ప్రభావం.. రేపు ఉదయం వరకు 6 జిల్లాల్లో రాకపోకలు బంద్
* సినీ పరిశ్రమకు స్థలం, సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య: CM రేవంత్
* కనీస మద్దతు ధర ₹8110తో పత్తి కొనుగోలు: అచ్చెన్నాయుడు
* హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత.. అంత్యక్రియలు పూర్తి
* రేవంత్‌ను ప్రజలు క్షమించరు: కవిత
* 8వ పే కమిషన్‌కు కేంద్రం ఆమోదం

News October 29, 2025

రేపే సెమీస్.. ఆ ట్రెండ్ బ్రేక్ చేస్తారా?

image

ICC టోర్నీల్లో అన్‌లక్కీయెస్ట్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. రేపు WWC తొలి సెమీస్‌లో ENGతో తలపడనుంది. గెలిస్తే వన్డే WC చరిత్రలో తొలిసారి ఫైనల్‌ చేరనుంది. SA మెన్స్&ఉమెన్స్ టీమ్స్ ఎంత పటిష్ఠంగా ఉన్నా నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తాయి. ఈసారైనా ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తారేమో చూడాలి. ఈనెల 30న రెండో సెమీస్‌లో IND, AUS తలపడనున్నాయి.

News October 29, 2025

విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారేమోనని ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుకెళ్లాడు

image

బకాయిల కోసం కరెంట్ కనెక్షన్‌ను కట్ చేస్తారేమోనని ఏకంగా ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకుపోయాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని భిండి జిల్లాలో ఇది జరిగింది. నిందితుడు శ్రీరామ్ బిహారీ త్రిపాఠి ₹1,49,795 బకాయి పడ్డాడు. సిబ్బంది ఇంటి కనెక్షన్‌తో పాటు అక్కడి 25KV ట్రాన్స్‌ఫార్మర్‌నూ తీసేస్తారని భావించాడు. దీంతో దాన్నితొలగించి ఇంటికి తీసుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.