News May 26, 2024
21MP స్థానాల్లో మహిళలే నిర్ణేతలు.. గెలుపును ఎవరికి కట్టబెట్టారో?

AP: ఈ నెల 13న జరిగిన పోలింగ్లో 21 లోక్సభ స్థానాల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు. శ్రీకాకుళంలో 47,236, గుంటూరులో 39,959, విశాఖలో 37,685 ఓట్లు అధికంగా నమోదయ్యాయి. అమలాపురం, ఒంగోలు, కర్నూలు, హిందూపురం పార్లమెంట్ సీట్లలో మాత్రమే పురుషులు ఎక్కువగా ఓటేశారు. అత్యధికంగా నమోదైన మహిళల ఓట్లు ఏ పార్టీకి పడ్డాయనేది ఆసక్తికరంగా మారింది. తమకే వేశారని వైసీపీ, కూటమి నేతలు ధీమాగా ఉన్నారు.
Similar News
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
News September 18, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.