News May 26, 2024

రేణిగుంట-కడప రహదారిపై వ్యక్తి మృతి

image

రేణిగుంట-కడప జాతీయ రహదారిలోని చెంగారెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉన్నట్లు గుర్తించారు. మృతుడు రైలు నుంచి జారి పడిపోయాడా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్నది విచారణలో తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 26, 2026

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన SP

image

చిత్తూరు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ రిపబ్లిక్ డే పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని సోమవారం ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. సిబ్బందికి ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, ఎంటీఓ వీరేశ్ పాల్గొన్నారు.

News January 26, 2026

చిత్తూరు: జెండా వందనం చేసిన కలెక్టర్

image

చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అధికార యంత్రాంగానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డా. థామస్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా అధికార యంత్రాంగం, విద్యార్థులు పాల్గొన్నారు.

News January 26, 2026

చిత్తూరులో పీజీఆర్ఎస్ రద్దు

image

సోమవారం కలెక్టరేట్, పోలీసు జిల్లా కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఆ కార్యక్రమం రద్దు చేసినట్లు వెల్లడించారు. వచ్చేవారం నుంచి యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.