News May 26, 2024

శ్రీకాకుళం: ర్యాంకుల వారీగా పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన

image

జిల్లాలో రేపటి నుంచి పాలిసెట్ సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. మే 27 తేదీన 1 నుంచి 12 వేల లోపు, 28 తేదీన 12,001 నుంచి 27 వేల లోపు, 29 తేదీన 27,001 నుంచి 43 వేలు లోపు, 30 తేదీన 43,001 నుంచి 59 వేల లోపు, 31 తేదీన 59,001 నుంచి 75 వేలు, జూన్‌ 1 తేదీన 75,001 నుంచి 92,000 వరకు, 2 తేదీన 92,001 నుంచి 1,08,000 వరకు, జూన్ 3 తేదీన 1,08,001 నుంచి చివరి ర్యాంకు వచ్చిన అభ్యర్థులు పరిశీలనకు హాజరుకావాలి.

Similar News

News September 13, 2025

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా మధురై(MDU), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ 06059 MDU- BJU ట్రైన్‌ను SEPT 17- NOV 26 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. నం.06060 BJU- MDU ట్రైన్‌ను SEPT 20-NOV 29 వరకు ప్రతి శనివారం సేవలు అందిస్తుందన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News September 13, 2025

శ్రీకూర్మనాథ క్షేత్రం పాలకమండలి నియామకం

image

గార(M) శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రానికి పాలకవర్గ సభ్యులును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా(వంశపారంపర్య ధర్మకర్త) గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు వ్వవహరిస్తారు. తొమ్మిది మంది సభ్యులుగా సంయుక్త, కుసుమకుమారి, పెంటయ్య, శ్రీనివాసరావు, మునీక, శ్వేతబిందు, సూరిబాబు, కళ్యాణచక్రవర్తి, లక్ష్మిలను నియమించింది. అఫీషియో మెంబర్‌గా సీతారామనృసింహులు ఎన్నికయ్యారు.

News September 13, 2025

శ్రీకాకుళం: ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దు

image

రైతులు ఎరువులకు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులను భరోసా కల్పించారు. శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు తమకున్న ఎరువుల సమస్యలను ఫోన్‌లో కలెక్టర్‌కు వివరించారు. సంతబొమ్మాళి మండలం మేఘవరం గ్రామానికి చెందిన ఎల్.సోమేశ్వరరావు, శ్రీముఖలింగం గ్రామానికి చెందిన రాజశేఖర్ నాయుడు, SM పురానికి చెందిన ఈశ్వరరావుతో పాటు పలు రైతులు సమస్యలను తెలియజేశారు.