News May 26, 2024
నిప్పుల కొలిమిలా నిర్మల్..రాష్ట్రంలోనే అత్యధికం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొట్టడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అత్యధికంగా నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రికార్డు స్థాయిలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్లోని ముజిగిలో 45.2, నిర్మల్ జిల్లా కడెంలో 44.6, నిర్మల్ జిల్లా తానుర్లో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని చాప్రలలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News November 2, 2025
ADB: ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరి: సలోని చాబ్రా

వయోవృద్ధులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలని ట్రైనీ కలెక్టర్సలోని చాబ్రా అన్నారు. పట్టణంలోని జిల్లా వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పర్యవేక్షణతో ఉండి వారికి ఎల్లప్పుడూ అండగా నిలవాలని సూచించారు.
News November 1, 2025
ADB: జాతీయ గౌరవ దివాస్లో పాల్గొన్న ఎంపీ నగేశ్

హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడి అమరుడైన గొప్ప నాయకుడు బీర్సా ముండా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో MLA పాయల్ శంకర్ పాల్గొన్నారు.
News November 1, 2025
ADB: మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించిన MP నగేశ్

మాజీ మంత్రి, MLA తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ శనివారం హరీష్ రావు నివాసంలో శనివారం పరామర్శించారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.


