News May 26, 2024

రాయలసీమ గురించి తప్పుగా మాట్లాడితే తాటతీస్తాం: సీమ కృష్ణ రాథోడ్

image

రాయలసీమ సంప్రదాయాన్ని, విలువలను తప్పుగా చిత్రీకరిస్తూ మాట్లాడే వ్యక్తుల తాట తీస్తామని రాయలసీమ ఉద్యమ నాయకులు సీమ కృష్ణ రాథోడ్ హెచ్చరించారు. తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజం నడుస్తోందంటూ టీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ మాట్లాడటం పట్ల ఆయన స్పందించారు. రాయలసీమను తక్కువ చేసి మాట్లాడటం ఇతర ప్రాంతాల వారికి అలవాటుగా మారిందన్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు.

Similar News

News October 10, 2024

నంద్యాల: కొబ్బరి బొండంపై నవదుర్గల చిత్రాలు

image

ఆళ్లగడ్డకు చెందిన ఆర్టిస్టు విజయ్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా కొబ్బరి బొండంపై నవదుర్గ మాతల చిత్రాలను అక్రిలిక్ రంగులతో తీర్చిదిద్దారు. ఆది పరాశక్తి జగజ్జనని 9 రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహా గౌరి, సిద్ధిధాత్రి అమ్మవార్ల చిత్రాలను చిత్రీకరించారు.

News October 10, 2024

నంద్యాల చిత్రకారుడి ప్రతిభ.. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపం

image

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ మరోసారి తన టాలెంట్ చూపెట్టారు. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపాన్ని చిత్రీకరించి అబ్బురపరిచారు. బాబాపై ఉన్న భక్తి, ప్రేమతో ఈ చిత్రాన్ని వేసినట్లు ఆయన తెలిపారు. ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అన్న నినాదం ఈ చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ప్రస్తుత సమాజానికి బాబా బోధనలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

News October 10, 2024

100 రోజుల ప్రణాళికలను సాధించాలి: కలెక్టర్

image

డిసెంబర్ 31వ తేది లోపు రెండో దశ 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 100 రోజులు లక్ష్యాల (ఫేజ్-II)పై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలకు సంబంధించిన రెండో దశ 100 రోజుల లక్ష్యాల సాధనపై సమీక్షించారు. లక్ష్య సాధనలో వెనకబడకూడదని ఆదేశించారు.