News May 27, 2024
అకాల వర్షాలు.. హైదరాబాద్లో జాగ్రత్త!
హైదరాబాదీలను అకాల వర్షం వణికించింది. మే 7న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు, బహదూర్పురాలో కరెంట్ షాక్తో ఒకరు, బేగంపేట నాలాలో ఇద్దరు విగతజీవులయ్యారు. ఆదివారం కురిసిన గాలివాన కూడా విషాదాన్ని నింపింది. శామీర్పేటలో చెట్టు విరిగి పడి ఇద్దరు, మియాపూర్లో బాల్కనీ గోడ కూలి ఓ బాలుడు, మరో వ్యక్తి చనిపోయారు. వర్షాలు, వరదల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండండి. SHARE IT
Similar News
News September 29, 2024
BREAKING: రేపు మూసి బాధితుల వద్దకు కేటీఆర్
రేపు మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్లో సమావేశం అనంతరం మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్గూడలో పర్యటించనున్నారు. తర్వాత అత్తాపూర్లోని కిషన్బాగ్ ప్రాంతాల్లోని మూసీ ప్రాజెక్ట్తో నష్టపోతున్న ప్రజలను కలవనున్నారు.
News September 29, 2024
HYD: మూసీ భాదితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం: మంత్రి
మూసి నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లను కాపాడే భాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సొంత నివాసం లేని వారికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, పేదలని కన్నబిడ్డల్లాగా చూసుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్ను బెస్ట్ సిటీగా నిర్మిస్తామని తెలిపారు.
News September 29, 2024
HYD: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత..!
HYDలోని 691 ప్రభుత్వ పాఠశాలలో 1,12,650 మంది విద్యార్థులు ఉండగా.. వీరికి 4,265 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల పరిధిలో అనేక పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. 10వ తరగతి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా మారింది. ఇకనైనా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.