News May 27, 2024
రెంటచింతల: ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి రిమాండ్

రెంటచింతల మండలంలోని రెంటాలలో ఈ నెల 13న ఏజెంట్లపై దాడి కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎం. ఆంజనేయులు ఆదివారం తెలిపారు. దాడిలో గాయపడిన చేరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, చేరెడ్డి మంజుల, గొంటు నాగమల్లేశ్వరరెడ్డి, చేరెడ్డి రఘురామిరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 12 మందిని గురజాల జూనియర్ సివిల్ జిడ్జి ముందు హాజరు పరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News January 1, 2026
GNT: అల్లర్లు లేవు.. పోలీసుల పక్కా ప్లాన్ సక్సెస్.!

నూతన సంవత్సర వేడుకలతో గుంటూరు జిల్లా సందడిగా మారింది. పూలబొకేలు, స్వీట్స్, కేకుల విక్రయాలు జోరుగా సాగాయి. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులతో మహిళలు, యువతులు సందడి చేశారు. అర్ధరాత్రి నుంచే యువత శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా యువత కొద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా గుంటూరు జిల్లా పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
News January 1, 2026
GNT: అల్లర్లు లేవు.. పోలీసుల పక్కా ప్లాన్ సక్సెస్.!

నూతన సంవత్సర వేడుకలతో గుంటూరు జిల్లా సందడిగా మారింది. పూలబొకేలు, స్వీట్స్, కేకుల విక్రయాలు జోరుగా సాగాయి. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులతో మహిళలు, యువతులు సందడి చేశారు. అర్ధరాత్రి నుంచే యువత శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా యువత కొద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా గుంటూరు జిల్లా పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
News December 31, 2025
GNT: SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి

గుంటూరు జిల్లా SC,ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి బ్రహ్మయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కమిటీకి సభ్యుడుగా నియమించిన గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం 1989లో ఏర్పాటు చేసిన చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగపరిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.


