News May 27, 2024
స్కూళ్లలో మధ్యాహ్న భోజనం.. వంట సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్

AP: ప్రభుత్వ స్కూళ్లలో మరింత నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మధ్యాహ్న భోజనం వండే సిబ్బందికి వంటకాల తయారీపై విజయవాడలోని తాజ్ హోటల్లో పనిచేసే చెఫ్లతో శిక్షణ ఇప్పించింది. అంతేకాకుండా తిరుపతి తాజ్ హోటల్ చెఫ్లతో వంటల చిట్కాలు, ఆయా వంటలతో కలిగే లాభాల గురించి వీడియోలను రూపొందించింది. వాటిని పాఠశాల విద్యాశాఖ నిర్వహించే సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేసింది.
Similar News
News February 20, 2026
సర్పంచ్లకు గుడ్ న్యూస్

AP: సర్పంచ్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలో చేసిన తీర్మానాల ప్రకారం నిధులు వాడుకోవచ్చని పేర్కొంది. పనులు చేసిన తర్వాత మెజర్మెంట్స్ బుక్స్లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని వెల్లడించింది.
News February 19, 2026
RCBకి బంపర్ ఆఫర్.. $1.8బిలియన్ల బిడ్!

యాజమాన్య హక్కులపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బంపర్ ఆఫర్ వచ్చింది. స్టార్ ఫుట్బాల్ టీమ్ మాంచెస్టర్ యునైటెడ్ కో-ఓనర్ అవ్రామ్ గ్లేజర్ కొనుగోలుకు ఆసక్తి చూపించారు. 1.8 బిలియన్ డాలర్లకు (సుమారు ₹16,399కోట్లు) బిడ్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే బ్లాక్స్టోన్, కార్లైల్ గ్రూప్ సహా బడా సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో RCB ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం Diageo సంస్థ RCBకి ఓనర్గా ఉంది.
News February 19, 2026
నిద్రలో ఉలిక్కిపడుతున్నారా?.. కారణమిదే!

నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడటాన్ని ‘హిప్నిక్ జెర్క్’ అంటారు. ఇది జబ్బు కాదని, మెదడు పంపే సంకేతాల పొరబాటు మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ‘70% మందిలో ఇది కనిపిస్తుంది. అతిగా కాఫీ తాగడం, ఒత్తిడి, నిద్రలేమి దీనికి కారణాలు. గాఢనిద్రలోకి వెళ్లే క్రమంలో కండరాలు రిలాక్స్ అయినప్పుడు మెదడు మనం పడిపోతున్నామని భ్రమపడి ఇలా స్పందిస్తుంది. నిద్ర, వ్యాయామం ద్వారా దీనిని అదుపు చేయవచ్చు’ అని సూచిస్తున్నారు.


