News May 28, 2024

HYD: కాల్పులు జరిపిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి: ఒవైసీ

image

ఏఐఎంఐఎం మాలేగావ్ అధ్యక్షుడు అబ్దుల్ మాలిక్ పై కాల్పులు జరిపిన దుండగులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. పథకం ప్రకారం తమ పార్టీ మాలేగావ్ అధ్యక్షుడిపై దుండగులు ఆదివారం రాత్రి మూడుసార్లు కాల్పులు జరిపి పారిపోయారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గాయపడ్డ అబ్దుల్‌ను ప్రైవేటు చేర్పించి చికిత్స జరిపిస్తున్నామని.. కాల్పుల ఘటనపై విచారణ జరపాలని కోరారు.

Similar News

News September 21, 2024

HYD: ఫుట్ పాత్‌పై వ్యాపారం చేస్తే.. అంతే సంగతి!

image

HYD నగరంలో అనేక చోట్ల చిరు వ్యాపారులు ఫుట్ పాత్‌పై వ్యాపారం చేస్తున్నారు. వారందరికీ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ వ్యాపార సముదాయాలను అధికారులు తొలగించారు. వాటిలో పండ్ల దుకాణాలు, నర్సరీలు, గృహోపకర వస్తువుల దుకాణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఫుట్ పాత్‌పై వ్యాపారం చేయొద్దని సూచించారు.

News September 21, 2024

HYD: నాలుగేళ్లలో 50 వేల మందికి SKILL ట్రైనింగ్

image

వచ్చే నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని HYD నగరంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మూడింతల వృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. 2024-25 తొలి త్రైమాసికంలో జాతీయ ఐటీ ఎగుమతులు 3.3% పెరిగాయని, అదే సమయంలో రాష్ట్రంలో 11.3% వృద్ధి నమోదు అయినట్లుగా పేర్కొన్నారు.

News September 21, 2024

HYD: నేపాల్ వాళ్లకు సైతం ఇక్కడే ట్రైనింగ్!

image

రాజేంద్రనగర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో IPS అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ప్రోగ్రాంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్టేట్ హోం అఫైర్స్ కేంద్రమంత్రి నిత్యానందతో పాల్గొన్నారు. తామిద్దరం 16వ లోక్ సభలో సహచరులుగా ఉండటం ఇదే మొదటిసారి అని తెలిపారు. నేపాల్, భూటాన్ ప్రాంతానికి చెందిన వారు సైతం ఇక్కడే ట్రైనింగ్ పొందినట్లు ఎంపీ పేర్కొన్నారు.