News May 28, 2024
సాలూర్ అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఏసీబీ తనిఖీలు

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూర అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. చెక్ పోస్టు వద్ద ఆర్టీఏ అధికారులు వాహనదారుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారనే సమాచారంతో నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 7, 2025
నిజామాబాద్: ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్లోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.
News July 7, 2025
NZB: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గాంధారి నరసింహారెడ్డి

నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
News July 7, 2025
NZB: రైలు ఢీకొని మహిళ మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్-జానకంపేట్ మధ్య KM.No 456-14 సమీపంలో ఆదివారం ఓ మహిళ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింనట్లు పేర్కొన్నారు. ఆమె సంబంధించిన వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.