News May 28, 2024

శ్రీకాకుళం: ఏజెంట్లుకు కలెక్టర్ కీలక సూచనలు

image

అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు జూన్ 4 తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, ప్రతీ ఏజెంటు పెన్ను, పెన్సిల్, నోట్ పేడ్ తీసుకురావాలన్నారు. రిటర్నింగ్ అధికారులు అనుమతి లేకుండా ఏజెంట్లు ఎవరూ లోపలికి బయటకు వెళ్లరాదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అంతా సహకరించాలని కోరారు.

Similar News

News October 6, 2024

వంగర: చెరువులో పడి యువకుడి మృతి

image

వంగర మండల కేంద్రంలోని అరసాడలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో సుకాసి శంకర్ (29) గల యువకుడు గ్రామ శివాలయం వెనుక బాహ్య ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వెళ్లి చెరువులో కాలుజారి చనిపోయినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. ఆదివారం మృతుని తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News October 6, 2024

మాజీ మంత్రి అప్పలరాజుని కలిసిన ధర్మాన

image

వైసీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుని ఆదివారం వైసీపీ యువ నాయకులు డా.ధర్మాన కృష్ణ చైతన్య గౌరవ పూర్వకంగా కలిశారు. అనంతరం శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. అతనితో పాటు ఎంపీపీ మురళీధర్, గోపి, జడ్పీటీసీ రామారావు, సుడా మాజీ ఛైర్మన్ గుప్త, కన్వీనర్లు జగన్, నరసింగరావు పాల్గొన్నారు.

News October 6, 2024

దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.