News May 30, 2024
నేడు కన్యాకుమారికి ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో నేటి సాయంత్రం నుంచి జూన్ 1న మ.3 గంటల వరకు ధ్యానంలో కూర్చుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు అక్కడ భద్రతను పెంచారు. 2వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం ముగిసిన అనంతరం ఆయన కేదార్నాథ్ గుహలో ధ్యానం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 19, 2026
గర్ల్ఫ్రెండ్తో పూల్లో హార్దిక్ పాండ్య.. ఫొటో వైరల్

తన గర్ల్ఫ్రెండ్ మహీకా శర్మకు బర్త్డే విషెస్ చెబుతూ క్రికెటర్ హార్దిక్ పాండ్య పోస్ట్ చేసిన ఫొటో వైరలవుతోంది. స్విమ్మింగ్ పూల్లో ఆమెతో క్లోజ్గా ఉన్న ఫొటోను హార్దిక్ ఇన్స్టాలో షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్డే మై ప్రిన్సెస్’ అని పేర్కొన్నారు. కాగా గత ఏడాది OCTలో మహీకాతో రిలేషన్షిప్ను హార్దిక్ కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి ఆమెతో కలిసి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
News February 19, 2026
మానవాభివృద్ధిలో AI కీలక మలుపు: మోదీ

మానవాభివృద్ధిలో AI కీలక మలుపు అని ఢిల్లీ సమ్మిట్లో మోదీ అన్నారు. మనుషులు, టెక్ కలిసి పనిచేసే దశలోకి ప్రవేశిస్తున్నామన్నారు. ఈ విప్లవాన్ని శాసించేందుకు పెద్ద విజన్ అవసరమని పేర్కొన్నారు. ఈ జర్నీలో భారత్ కేవలం భాగంగానే కాకుండా ముందుండి నడిపిస్తోందన్నారు. ఈ కొత్త సాంకేతికత మనుషుల్ని ముడి పదార్థాలుగా మార్చే అవకాశం ఇవ్వొద్దన్నారు. ఏ టెక్నాలజీ అయినా కంట్రోల్లో ఉండాలంటూ AI నియంత్రణను ప్రస్తావించారు.
News February 19, 2026
T20 WCలో ఆడనున్న బంగ్లాదేశ్.. ఎప్పుడంటే?

టీ20 వరల్డ్ కప్-2028కి అర్హత సాధించిన 12 జట్ల పేర్లను ICC ప్రకటించింది. ఈ లిస్టులో భారత్, NZ, AUS, PAK, శ్రీలంక, SA, AFG, ENG, ఐర్లాండ్, WI, ZIM, బంగ్లాదేశ్ ఉన్నాయి. WC-26లో సూపర్-8కి వెళ్లిన 8 జట్లు, 2028 WC హోస్ట్ నేషన్స్ (AUS, NZ)తో పాటు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా 3 జట్లను (AFG, BAN, IRE) తీసుకున్నట్లు వివరించింది. మరో 8 జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా ఎంపిక కానున్నాయి.


