News May 30, 2024
GOOD NEWS: పుస్తకాల రేట్లు తగ్గించిన ప్రభుత్వం
TG: జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో అన్ని మీడియంలకు చెందిన పాఠ్యపుస్తకాల ధరలు తగ్గనున్నాయి. ఒక్కో బుక్పై ₹10 నుంచి ₹74 వరకు తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. మార్కెట్లో పేపర్ రేటు తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో క్లాస్ బుక్స్ రేట్స్పై పేరెంట్స్కు ₹200-300 ఆదా కానుంది. ఉదాహరణకు 2023-24లో టెన్త్ పుస్తకాల ధర ₹1,482 ఉండగా ఈసారి ₹1,126కి తగ్గింది.
Similar News
News October 15, 2024
వయనాడ్.. ప్రియాంకా గాంధీ పోటీ చేసేనా?
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాలకే పరిమితమైన ప్రియాంకా గాంధీ పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ రాజీనామాతో NOV 13న వయనాడ్(కేరళ) పార్లమెంట్కు <<14363811>>బైపోల్<<>> జరగనుండగా, ఇక్కడ ఆమె బరిలో దిగే ఛాన్స్ ఉంది. INC చీఫ్ ఖర్గే, సీనియర్ నేతలు ఆమె పోటీ చేస్తారని పలుమార్లు ప్రకటించారు. అయితే ప్రియాంక స్పందించలేదు. ఒకవేళ ఆమె పోటీ చేసి గెలిస్తే ఆ సెగ్మెంట్లో గెలిచిన తొలి మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు.
News October 15, 2024
దీపావళి పండుగ తేదీపై వివాదం
AP: ఈ ఏడాది దీపావళి పండుగ తేదీపై పంచాంగకర్తల మధ్య వివాదం నెలకొంది. అక్టోబర్ 31న జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగకర్తలు, నవంబర్ 1 అసలు తేదీ అని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు చెబుతున్నారు. రేలంగి పంచాంగాన్ని TTD అనుసరిస్తుండటంతో ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే వారు సరైన పద్ధతిలో గణించలేదని, సూర్యోదయం ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకోవాలని ధృక్ పంచాంగకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
News October 15, 2024
ఎల్లుండి కొమురంభీం జిల్లావ్యాప్తంగా సెలవు
TG: ఆదివాసీ పోరాట యోధుడు కొమురంభీం 84వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 17న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ఇవ్వాలని పేర్కొంటూ కలెక్టర్ వెంకటేశ్ ఉత్తర్వులిచ్చారు. వచ్చే నెల 9న(రెండో శనివారం) వర్కింగ్ డేగా నిర్ణయించారు.