News May 30, 2024
VJA: దారి దోపిడీ కేసులో ఎనిమిది మంది అరెస్ట్

సూరాయపాలెంలో ఇటీవల జరిగిన దారిదోపిడీ కేసులో బుధవారం భవానీపురం పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య అనే మహిళను తాడేపల్లికి చెందిన ఎనిమిది మంది యువకులు నగదు కోసం బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కర్రలు, రాడ్లు, పోలీసు టోపీ స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News April 24, 2025
గుడివాడ: వైసీపీకి హనుమంతరావు రాజీనామా..?

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు రాజీనామా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ఆయన, కూటమి అక్రమాలపై కలెక్టర్కు వినతి కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలి హనుమంతరావు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
News April 24, 2025
మచిలీపట్నం: నేడు జిల్లా సమీక్షా మండలి సమావేశం

కృష్ణాజిల్లాలో మండల సమీక్షా సమావేశం గురువారం మచిలీపట్నంలో జరగనుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సురేష్ అధ్యక్షతన ఉదయం 10.30ని.లకు జడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ప్రజా ప్రతినిథులు పాల్గొననున్నారు. అధికారులు తమ శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో హాజరు కావాలని చెప్పారు.
News April 24, 2025
మచిలీపట్నం: ‘హోంగార్డ్ సంక్షేమానికి కృషి చేస్తాం’

పోలీస్ శాఖలో అంతర్భాగంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని కృష్ణాజిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ గంగాధరరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హోంగార్డ్స్ సమస్యల పరిష్కారానికి దర్బార్ నిర్వహించారు. హోంగార్డుల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.