News May 30, 2024

ఆర్మూర్: రూ.కొటిన్నరతో దంపతులు పరార్

image

రూ.కొటిన్నరతో దంపతులు పరారైన ఘటన ఆర్మూర్‌లో జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లో నివాసం ఉండే ప్రవీణ్ దంపతులు జాతీయ రహదారి పక్కన కిరాణా షాప్, బట్టల వ్యాపారం నిర్వహించేవారు. వీరు చుట్టుపక్కల గ్రామాల్లో పలువురి వద్ద సుమారు రూ.కోటిన్నర వరకు అప్పు చేశారు. అప్పులు చెల్లించలేక నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి పారిపోయినట్లు బాధితులు తెలిపారు. వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు.

Similar News

News February 12, 2025

NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

ఇంటికి తాళం వేసి కుటుంబం కుంభమేళాకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో నివాసం ఉండే శేఖర్ కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లారు. కాగా అదే రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోని 2 తులాల బంగారం, 40 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు.

News February 12, 2025

నిజామాబాద్‌లో ఫొటో జర్నలిస్టు మృతి

image

నిజామాబాద్‌లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు. 

News February 12, 2025

NZB: బావిలో పడి బాలుడి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం ఇందల్వాయి మండలం డొంకల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మణ్(13) మరో ఇద్దరితో కలిసి మేకలు కాయడానికి గ్రామ శివారులోకి వెళ్లారు. బావిలో నీటిని తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లక్ష్మణ్ మృతి చెందినట్లు వెల్లడించారు.

error: Content is protected !!