News May 30, 2024

గెలిచిన 48 గంటల్లో పీఎంను డిసైడ్ చేస్తాం: జైరామ్ రమేశ్

image

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 సీట్లకుపైగా గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీనే కూటమికి అధ్యక్షత వహిస్తుందన్నారు. గెలుపొందిన 48 గంటల్లోనే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తామని తెలిపారు. ఇండియా కూటమి గెలుపొందాక NDA కూటమిలోని పలు పార్టీలు కూడా తమతో చేతులు కలిపే అవకాశం ఉందన్నారు.

Similar News

News October 15, 2024

‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్ తీసుకురానున్న ప్రభుత్వం?

image

AP: గతంలో అమలైన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి పథకాలను అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్‌లో దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్‌కిన్, డైపర్స్ వంటివి ఉంచి బాలింతలకు అందించేవారు.

News October 15, 2024

కరెంటు వాతలు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ: KTR

image

TG: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతోందంటూ KTR విమర్శించారు. ‘కరెంటు ఛార్జీల మోతకు సర్కార్ రెడీ. 300 యూనిట్లు దాటితే కిలో వాట్‌కు ఫిక్స్‌డ్ ఛార్జీ ₹50’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘పవర్‌లోకి వచ్చి ఏడాది కాకముందే ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. వినియోగదారులు జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే మీరు కొత్త బాదుడు షురూ చేస్తారా?’ అని ప్రశ్నించారు.

News October 15, 2024

GOOD NEWS: వచ్చే నెల నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్: మంత్రి కొల్లు

image

AP: మద్యం దుకాణాదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. MRP కంటే ఎక్కువ అమ్మినా, ట్యాక్స్ చెల్లించని మద్యం, నాటుసారా విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని, లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందన్నారు. 15 రోజుల్లో కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయిస్తామని తెలిపారు. సిండికేట్ లేకుండా చూస్తామన్నారు.