News May 30, 2024
ఐదేళ్ల క్రితం ఇదేరోజు అధికారంలోకి వచ్చాం: CM జగన్

AP: దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజు YCP అధికారంలోకి వచ్చిందని CM జగన్ ట్వీట్ చేశారు. ‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మన పార్టీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది’ అంటూ గతంలో ప్రమాణస్వీకారం చేసిన ఫొటోను పోస్ట్ చేశారు.
Similar News
News April 7, 2026
HPV వ్యాక్సిన్ వేయించుకున్నారా?

APలో 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత HPV వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. తొలి దశలో కేంద్రం 1.9L డోసులను ఇవ్వగా ఇప్పటి వరకు 1.14L మందికి టీకాలు అందించింది. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో దేశంలోనే రాష్ట్రం టాప్లో నిలిచింది. రెండో దశలో మరో 1.9L డోసులను కేంద్రం పంపింది. మే వరకు వ్యాక్సినేషన్ కొనసాగనుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని అధికారులు చెబుతున్నారు.
News April 7, 2026
ఆసియా బ్యాడ్మింటన్.. భారత్ గోల్డ్ సాధించేనా?

చైనా వేదికగా నేటి నుంచి ఈ నెల 12 వరకు ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరగనుంది. భారత్ నుంచి మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్, ప్రణయ్, శ్రీకాంత్, ఆయుష్, ఉమెన్స్ సింగిల్స్లో PV.సింధు, ఉన్నతి, తన్వి, మాళవిక బరిలో ఉన్నారు. డబుల్స్లో సాత్విక్-చిరాగ్ టోర్నీ నుంచి తప్పుకున్నారు. మహిళల విభాగంలో గాయత్రి-ట్రీసా జాలీ పోటీ పడుతున్నారు. కాగా ఈ టోర్నీలో IND చివరగా 1965లో (దినేశ్ ఖన్నా) గోల్డ్ మెడల్ గెలిచింది.
News April 7, 2026
తగ్గుతున్న జననాలు.. స్కూళ్లలో చేరికపై ప్రభావం!

APలో జననాల రేటు నాలుగేళ్ల వ్యవధిలో 2.1 నుంచి 1.5 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం అన్ని స్కూళ్లు, కాలేజీల్లో చేరికలపై చూపుతోంది. రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం 2024-25లో విద్యార్థులు 83.44 లక్షలుగా ఉంటే 2025-26కు ఆ సంఖ్య 83,28,448కి తగ్గింది. ఇక 1-5 క్లాసుల్లో అడ్మిషన్లు 2023-24లో 34,27,904గా ఉంటే మరుసటి ఏడాదికి ఆ సంఖ్య 32,64,668కి తగ్గిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.


