News May 31, 2024

రాయదుర్గంలో శ్రీవారి శయణోత్సవం.. ముగిసిన బ్రహ్మోత్సవాలు

image

రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవ వేడుకలు గురువారం ముగిశాయని ఆలయ ఈవో నరసింహారెడ్డి మీడియాతో తెలిపారు. సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సప్త ప్రాకారోత్సవం కార్యక్రమం చేపట్టారు. అనంతరం శయనోత్సవం కార్యక్రమం చేపట్టారు. దీంతో బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయన్నారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన పట్టణ పుర ప్రజలకు, భక్తులకు ఆలయ ఈవో ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News September 14, 2025

వైద్యాధికారులతో అనంతపురం కలెక్టర్ సమావేశం

image

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్ ఆనంద్‌ను DMHO డాక్టర్ దేవి పుష్పగుచ్చంతో శనివారం స్వాగతించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అందుతున్న సేవలపై DMHOతో చర్చించారు. జిల్లాలో PHC, CHC, విలేజ్ హెల్త్ సెంటర్, క్లినిక్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News September 13, 2025

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఆనంద్ శనివారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలకు సూచించారు.

News September 13, 2025

‘అనంత జిల్లాకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండండి’

image

అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.