News May 31, 2024
విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్లదే : మంత్రి తుమ్మల
ఎరువులు, విత్తనాలు రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సెక్రటేరియట్లో పత్తి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ మేరకు నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విత్తనాల సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు.
Similar News
News September 30, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ధర ఎంతంటే
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సెలవులు అనంతరం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఆదివారం క్వింటా ఏసీ మిర్చి ధర 20వేల రూపాయలు పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులను మార్కెట్ తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయ విక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.
News September 30, 2024
ఖమ్మం: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
ఖమ్మం 2938 321 1: 09
భద్రాద్రి 2414 260 1:10
News September 30, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} కరకగూడెంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు