News May 31, 2024
ఏపీ ఈసెట్ ఫలితాల్లో మెరిసిన శ్రీకాకుళం విద్యార్థిని
ఏపీ ఈసెట్ ఫలితాల్లో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆమదాలవలస మండలం శ్రీహరిపురానికి చెందిన కూన జ్యోత్స్న 8వ ర్యాంకు (బ్రాంచ్ ర్యాంక్), ఇంటిగ్రేటెడ్ ర్యాంక్-826 సొంతం చేసుకుంది. ఈ విద్యార్థిని 200 మార్కులకు గాను 105 మార్కులు సాధించింది. 10వ తరగతి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదవగా.. డిప్లొమా అనకాపల్లిలో పూర్తి చేసింది. మంచి ర్యాంక్ రావడంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
Similar News
News October 6, 2024
వంగర: చెరువులో పడి యువకుడి మృతి
వంగర మండల కేంద్రంలోని అరసాడలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో సుకాసి శంకర్ (29) గల యువకుడు గ్రామ శివాలయం వెనుక బాహ్య ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వెళ్లి చెరువులో కాలుజారి చనిపోయినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. ఆదివారం మృతుని తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News October 6, 2024
మాజీ మంత్రి అప్పలరాజుని కలిసిన ధర్మాన
వైసీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుని ఆదివారం వైసీపీ యువ నాయకులు డా.ధర్మాన కృష్ణ చైతన్య గౌరవ పూర్వకంగా కలిశారు. అనంతరం శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. అతనితో పాటు ఎంపీపీ మురళీధర్, గోపి, జడ్పీటీసీ రామారావు, సుడా మాజీ ఛైర్మన్ గుప్త, కన్వీనర్లు జగన్, నరసింగరావు పాల్గొన్నారు.
News October 6, 2024
దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు
దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.