News June 1, 2024

‘పారిపోకండి’ అంటూ కాంగ్రెస్‌పై అమిత్‌షా సెటైర్

image

ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అమిత్‌షా అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదన్న కాంగ్రెస్ నిర్ణయంపై ‘పారిపోకండి’ అంటూ Xలో పోస్ట్ పెట్టారు. ‘INCకి భారీ ఓటమి తప్పదు. ఆ విషయం ఆ పార్టీకి తెలుసు. ఇక ప్రజలను, మీడియాను ఎలా ఎదుర్కొంటుంది? అందుకే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకుండా పారిపోతోంది. అలా చేయకుండా ఓటమినెదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News October 13, 2024

PLEASE CHECK.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు. పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు. ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి. క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చు.

News October 13, 2024

కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోంది: హరీశ్

image

TG: PAC ఛైర్మన్, మండలి చీఫ్ విప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మండలి చీఫ్ విప్‌గా మహేందర్ రెడ్డిని ఎలా నియమిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉంది. వేటు వేయాల్సిన ఛైర్మనే మహేందర్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలి. PAC ఛైర్మన్ విషయంలోనూ ఇలానే చేశారు’ అని ఆయన ధ్వజమెత్తారు.

News October 13, 2024

రాష్ట్ర పండుగగా ‘వాల్మీకి జయంతి’

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17న వాల్మీకి జయంతిని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. అనంతపురంలో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించనుంది. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది.