News June 1, 2024
రాష్ట్రానికి తిరిగొచ్చిన సీఎం జగన్
యూకే పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగొచ్చారు. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్తారు. ఎన్నికల పోలింగ్ అనంతరం గత నెల 17న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Similar News
News October 13, 2024
PLEASE CHECK.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు. పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు. ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇక్కడ <
News October 13, 2024
కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోంది: హరీశ్
TG: PAC ఛైర్మన్, మండలి చీఫ్ విప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘మండలి చీఫ్ విప్గా మహేందర్ రెడ్డిని ఎలా నియమిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర పెండింగ్లో ఉంది. వేటు వేయాల్సిన ఛైర్మనే మహేందర్ను చీఫ్ విప్గా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలి. PAC ఛైర్మన్ విషయంలోనూ ఇలానే చేశారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
News October 13, 2024
రాష్ట్ర పండుగగా ‘వాల్మీకి జయంతి’
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17న వాల్మీకి జయంతిని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. అనంతపురంలో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించనుంది. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది.