News June 1, 2024

ADB: ఏవో బదిలీ, ఏఈవో సస్పెండ్.. ఎందుకంటే!

image

ADBలో రైతులు డిమాండ్ చేసే పత్తివిత్తనాల విషయంలో పర్యవేక్షణను ప్రామాణికంగా తీసుకొని పట్టణ వ్యవసాయ అధికారి రమేశ్‌ను బాధ్యతల నుంచి తప్పించి బోథ్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో బోథ్ వ్యవసాయ అధికారి విశ్వామిత్రను నియమించారు. పట్టణంలోని ఫర్టిలైజర్ షాప్‌లో పూర్తి స్థాయి విత్తనాలు పంపిణీ చేయించడంలో నిర్లక్ష్యం వహించిన యాపల్‌గూడ ఏఈవో శివచరణ్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News September 29, 2024

ఆసిఫాబాద్: పాఠశాల గదిలోకి పాము

image

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం కన్నెపల్లి యూపీఎస్ పాఠశాల తరగతి గదిలో శనివారం పాము రావడంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. ఇలా గదులలోకి పాములు, తేళ్లు, క్రిమి కీటకాలు రావడంతో విద్యార్థులు భయందోళనకు గురవుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.

News September 29, 2024

దసరా నవరాత్రుల్లో బాసర అమ్మవారు దర్శనం ఇచ్చే అవతారాలు ఇవే

image

బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అలంకరిస్తామన్నారు. మొదటిరోజు శేలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడవరోజు చంద్రఘటా, నాలుగోరోజు కూష్మాండ అలంకరణ, ఐదోరోజు స్కదమాతగా, ఆరోరోజు కాత్యాయగాని, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజు మహాగౌరీగా, తొమ్మిదోజు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తారని తెలిపారు.

News September 29, 2024

ఆదిలాబాద్: పల్లె ఓటర్ల లెక్క తేలింది

image

గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల లెక్క తేలింది. సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీల్లో వార్డుల వారీగా సిద్దం చేసిన ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను పంచాయతీ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలోని 17 మండలాల్లో గల 473 గ్రామ పంచాయతీల పరిధిలో 4,41,795 మంది ఓటర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. ఇందులో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.