News June 1, 2024

శ్రీకాకుళం: ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం

image

బాచుపల్లి PS పరిధి కౌసల్యకాలనీలో విషాదం నెలకొంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరవర్ధన్ రెడ్డి(33) ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం వాసి వీరవర్ధన్ గత కొంతకాలంగా బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. తన భార్య డెలివరీ కోసం ఇటీవల కుమారుడితో కలిసి స్వస్థలానికి వెళ్లింది. శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే సూసైడ్‌కు కారణమని తెలుస్తోంది. కేసు నమోదైంది.

Similar News

News January 13, 2026

కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించండి మహాప్రభో…!

image

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని ఆ ప్రాంత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, అడవి ఏనుగుల్ని తమ ప్రాంతం నుండి ఒడిశా సరిహద్దులలోకి తరిమివేయాలని వారు కోరుతున్నారు.

News January 13, 2026

శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

image

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.

News January 13, 2026

శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

image

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.