News June 1, 2024

గరివిడి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

గరివిడి మండలం ఎం.దుగ్గివలస గ్రామానికి చెందిన దాసరి సత్యం (38) మనస్సు సరిగ్గా లేకపోవడంతో ఆతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.గురువారంఉదయం బయటకు వెళ్ళాడు. రమణఅనే వ్యక్తి తన కుమారుడు చీపురుపల్లి వద్ద పడిపోయినట్టు సమాచారం అందజేశారు. వెంటనే కుటుంబసభ్యులు ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మరణించినట్లు తల్లి తెలియజేసారని ఎస్సై కె.కె నాయుడు తెలిపారు

Similar News

News October 6, 2024

దళారుల బారిన పడి మోసపోవద్దు: VZM కలెక్టర్

image

కేజీబీవీలో ఉద్యోగాలకు కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక ఉంటుందని, దళారులబారిన పడి అభ్యర్థులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. డబ్బులు వసూలు చేస్తున్న వారి వివరాలు తమకి తెలియజేయాలని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

News October 6, 2024

విజయనగరం జిల్లా టెట్ అభ్యర్థులకు కీలక UPDATE

image

విజయనగరం జిల్లాలోని టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్, నామినల్ రోల్‌లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు. ఇందుకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. ఇంటిపేరు, బర్త్ డే మార్పుల కోసం టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏదైనా గుర్తింపు కార్డును ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులకు అందజేయాలని డీఈవో పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 6, 2024

VZM: మంత్రి కొండపల్లికి ఘన స్వాగతం

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులను ఆహ్వానించేందుకు 10 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ఘన స్వాగతం లభించింది. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, పార్టీ నాయకులు మంత్రికి స్వాగతం పలికి సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.