News June 1, 2024
రామగుండం: తాను మరణిస్తూ.. చూపునిచ్చాడు!
రామగుండం NTPC అన్నపూర్ణ కాలనీకి చెందిన ఈదునూరి కిశోర్ వడదెబ్బతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రవణ్ కుమార్, లింగమూర్తి, సానా రామకృష్ణా రెడ్డి, రమేశ్, బీష్మాచారి, వాసు, చంద్రశేఖర్, శశికళ, శారద, లక్ష్మీనారాయణ ఉన్నారు.
Similar News
News September 30, 2024
ధర్మపురిలో నిత్యం 2 వేల లడ్డూ విక్రయాలు
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ ఆలయంలో ప్రతిరోజు 2000 లడ్డూ విక్రయాలు జరుగుతాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా 80 గ్రాముల లడ్డూ ప్రసాదానికి రూ.20 అలాగే 200 గ్రాముల పులిహోర ప్రసాదానికి రూ.15 తీసుకుంటున్నారు. 2023-24 సంవత్సరానికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,50,20,00, పులిహోర ప్రసాదం ద్వారా రూ.54,69,750 ఆదాయం సమకూరింది.
News September 30, 2024
ముస్తాబాద్: బస్సు కింద పడి చిన్నారి మృతి
ముస్తాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. సాల్కం మనోజ్ఞ(4) మండల కేంద్రంలోని మహర్షి పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. స్కూల్ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు టైర్ల కింద పడింది. దీంతో చిన్నారి తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News September 30, 2024
కరీంనగర్ చేరుకున్న మంత్రి సీతక్క
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ మహాత్మనగర్లో మిషన్ భగీరథ గెస్ట్హౌస్కు చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ పమేలా సత్పతి, మిషన్ భగీరథ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి సీతక్క కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.