News June 1, 2024
AARA సర్వే: రాజమండ్రిలో పురంధరీశ్వరి గెలుపు డౌట్
కూటమి పొత్తులో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ బరిలో నిలిచిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి గట్టిపోటీ ఎదుర్కోనున్నట్లు ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. కాగా ఇక్కడ ఆమె గెలుపు, ఓటమికి సమాన అవకాశాలు ఉండనున్నాయని పేర్కొంది.
Similar News
News September 28, 2024
రాజమండ్రి: చిరుత కనిపించలేదు: DFO
కడియం మండలం బుర్రిలంక పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు ఇంకా గుర్తించలేదని, పాదముద్రలు కూడా కనిపించలేదని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి శనివారం తెలిపారు. దివాన్ చెరువు ప్రాంతంలో కూడా ఏ విధమైన సమాచారం లభించలేదన్నారు. బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉన్న నేపథ్యంలో చిరుత అటు వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆ ప్రాంతాల్లో గాలిస్తామన్నారు.
News September 28, 2024
తూ.గో.: పిడుగు పడతాయి జాగ్రత్త
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కోనసీమ, కాకినాడ రూరల్, తుని, సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి, అనపర్తి తదితర ప్రాంతాల్లోని ప్రజల సెల్ఫోన్లకు సందేశాలు పంపించారు.
News September 28, 2024
రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు మండపేట విద్యార్థులు
రాయవరం, కాకినాడలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ ఆటల పోటీల్లో మండపేటకు చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో ఉత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14, 17 విభాగాల్లో టెన్నికాయట్ లో బల్ల సత్యనారాయణ, కే.శివశంకర్ ప్రసాద్, ఖండవల్లి చైతన్యలు ఎంపికయ్యారు.