News June 1, 2024
YCPకి 14 సీట్లే వస్తాయి: KK సర్వే
గత ఎన్నికల్లో YCP గెలుపుపై అత్యంత ఖచ్చిత అంచనాలు వెల్లడించిన KK సర్వే సంచలన ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. ఏపీలో జగన్ పార్టీ కేవలం 14 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో TDP-133, జనసేన- 21, BJP-7 చోట్ల విజయం సాధించవచ్చని తెలిపింది. మొత్తంగా కూటమి అధికారంలోకి వస్తుందన్న KK సర్వే జనసేన పోటీ చేసిన అన్నిచోట్ల గెలుస్తుందని ప్రకటించడం గమనార్హం.
Similar News
News October 12, 2024
మహిళల టీ20 WC.. భారత్ సెమీస్ చేరాలంటే?
మహిళల టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. భారత్ సెమీస్ చేరాలంటే రేపు ఆసీస్తో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాలి. భారీ తేడాతో గెలిస్తే సులభంగా సెమీస్ చేరుతుంది. లేదంటే కివీస్ ఆడే చివరి 2 మ్యాచుల్లో ఓడాలి లేదా ఒకదాంట్లోనైనా చిత్తుగా ఓడాలి. అప్పుడు మెరుగైన నెట్ రన్రేట్తో భారత్ సెమీస్ చేరుతుంది.
News October 12, 2024
చెర్రీ, బాలయ్య సినిమాల నుంచి అప్డేట్స్
మెగా, నందమూరి ఫ్యాన్స్కు విజయ దశమి రోజున అప్డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఆ డేట్తో చరణ్ పిక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణతో బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న NBK109 మూవీని సంక్రాంతికి తీసుకురానున్నట్లు ఆ మూవీ టీమ్ ప్రకటించింది. దీపావళికి టైటిల్, టీజర్ను వదలనున్నట్లు తెలిపింది.
News October 12, 2024
అప్పుడు నారాయణ మూర్తి ఆహ్వానంపై రతన్ టాటా ఏమన్నారంటే?
రతన్ టాటాతో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను నారాయణ మూర్తి ఇటీవల గుర్తు చేసుకున్నారు. Infosysలో జంషెడ్జీ టాటా హాల్ ప్రారంభానికి రావాలని ఆహ్వానిస్తే ‘TCS మీ ప్రత్యర్థి. నన్నెందుకు ఆహ్వానిస్తున్నారు’ అని టాటా వ్యాఖ్యానించారట. దీనికి బదులిస్తూ ‘జంషెడ్జీ సంస్థల స్వరూపాన్నే మార్చిన వ్యక్తి. ఆయన్ను మాతో పోటీదారుగా పరిగణించం. ఇది ఆయన్ను గౌరవించుకొనే విషయం’ అని చెప్పినట్టు మూర్తి పేర్కొన్నారు.