News June 2, 2024
ODI క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న కోహ్లీ
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డును టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీ, క్యాప్ను ICC ఆయనకు బహూకరించింది. కాగా కోహ్లీ 2023లో వన్డేల్లో అదరగొట్టారు. 27 మ్యాచ్లు ఆడి 72.47 యావరేజ్తో 1,377 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ ఏడాదిలో కోహ్లీ అత్యుత్తమ స్కోరు 166*. వన్డే WCలో ఏకంగా 11 మ్యాచుల్లోనే 765 పరుగులు బాదారు.
Similar News
News October 12, 2024
నేటి నుంచి పాపికొండలు టూర్ స్టార్ట్
దసరా సందర్భంగా పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.
News October 12, 2024
నవంబర్ 8 నుంచి DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్
TG: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో సెలక్ట్ చేశారు.
News October 12, 2024
పండగకు ఊరెళ్తున్న సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.