News June 2, 2024

క్షణికావేశం.. కుమారుడిని కాల్చేసిన కానిస్టేబుల్

image

AP: ఓ కానిస్టేబుల్ క్షణికావేశంలో కన్నబిడ్డనే కాల్చేసిన ఘటన ఒంగోలులో జరిగింది. APSP కానిస్టేబుల్ కొదముల ప్రసాద్‌ EVM గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు శేష్ కమల్(20) నిన్న రాత్రి తండ్రిని బైక్‌పై తీసుకెళ్లి గోడౌన్ వద్ద వదిలాడు. అనంతరం జీతం డబ్బుల్లో నుంచి రూ.20వేలు ఇవ్వాలని కొడుకు అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాద్ తుపాకీతో కాల్చడంతో కొడుకు స్పాట్‌లోనే మరణించాడు.

Similar News

News November 15, 2025

మల్లె తోటల్లో కొమ్మ కత్తిరింపుల తర్వాత నీటి తడులు – జాగ్రత్తలు

image

మల్లె మొక్క కొమ్మల కత్తిరింపు తర్వాత మొక్కకు నీటి అవసరం ఎక్కువగా ఉండదు. ఈ సమయంలో అధిక నీటిని అందిస్తే మొక్కల వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. అందుకే నేల మరీ తడిగా, నీరు నేలపై నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒక వేలిని నేలలో 2-3 అంగుళాల లోతు వరకు పెట్టి నేల ఎండినట్లు అనిపిస్తేనే నీరు పోయాలి. మొక్క నుంచి కొత్త చిగురు, మొగ్గలు వచ్చే సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

News November 15, 2025

115 పోస్టులకు BOI నోటిఫికేషన్

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>BOI<<>>) 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీటెక్, BE, MSc, MCA అర్హత గల అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 15, 2025

బ్యాంకుల విలీనం మంచిదే: SBI ఛైర్మన్

image

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మంచిదేనని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. ‘మరోసారి విలీనాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులున్నాయి. అమెరికా విధించిన అదనపు టారిఫ్‌లతో మన దేశ ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ ఏ రంగం నుంచి SBIకి సమస్యలు ఎదురుకాలేదు. ఎక్స్‌పోర్ట్ చేసేవారికి సపోర్ట్ కొనసాగుతుంది. మార్కెట్ వాటా పొందే విషయంలో రాజీపడడం లేదు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.