News June 2, 2024

HYD: ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న రాచకొండ కమిషనర్

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పోరాటాలు, ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రత్యేక రాష్ర్ట పోరాటాన్ని తాను స్వయంగా చూశానని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖలో ఎన్నో నూతన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.

Similar News

News September 21, 2024

BREAKING: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

image

భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రూట్‌లలో భారీగా ట్రాఫిక్ జామైంది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి రాణిగంజ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. మరోవైపు భారీ వర్షం కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడం బెటర్.
SHARE IT

News September 21, 2024

HYDలో RELAX అంటూ వ్యభిచారం

image

RELAX అంటూ ఆన్‌లైన్‌లో అశ్లీల ఫొటోలు పంపి HYD‌ యువకులను ఆకర్షిస్తున్న వ్యభిచార ముఠా బాగోతం వెలుగుచూసింది. నెల్లూరు వాసి వంశీకృష్ణ, HYDకు చెందిన పార్వతి కలిసి ఈ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు పెట్టి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు రేట్‌ ఫిక్స్ చేసి వ్యభిచారం నిర్వహించారు. నిఘాపెట్టిన CYB AHTUకి వీరికి చెక్ పెట్టింది. గతంలోనూ వీరు ప్రాస్టిట్యూషన్‌ కేసులో అరెస్ట్ అయ్యారు.

News September 21, 2024

HYD: ఇండోర్, లక్నోకు వెళ్లిన మేయర్, కార్పొరేటర్లు

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్ఎంసీ స్టడీ టూర్‌కి వెళ్లారు. స్టడీ టూర్‌లో భాగంగా ఇండోర్, లక్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఆయా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న చేపట్టిన పలు వివిధ విధానాలను, అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం వాటిని గ్రేటర్ పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.