News June 2, 2024

దంపుడు బియ్యంతో ఆరోగ్యం భేష్

image

పాలిష్ పట్టిన బియ్యం కంటే దంపుడు బియ్యంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధకులు ఎప్పటినుంచో చెప్తున్న మాట. తెల్లబియ్యం వాడకాన్ని తగ్గించి వీటిని తీసుకుంటే మధుమేహం, రక్తపోటు ముప్పుని తగ్గిస్తాయి. నియాసిన్, విటమిన్ బి3, మెగ్నీషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ నివారిణిగా పనిచేయడంతో పాటు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పిండి పదార్థం తక్కువగా ఉండటంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగవు.

Similar News

News September 8, 2025

ఏపీలో BPCL ప్రాజెక్టు.. ToR ప్రిపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) 9 MMTPA గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ&పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(ToR) ప్రిపరేషన్‌కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. నెల్లూరు(D) చేవూరులో ₹1.03లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పబ్లిక్ హియరింగ్ నిర్వహించి, ఇతర వివరాలతో నివేదిక సమర్పించాలని BPCLకు నిపుణుల అంచనా కమిటీ సూచించింది.

News September 8, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TGలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, యాదాద్రి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు APలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

News September 8, 2025

సంక్రాంతి బరిలో రవితేజ సినిమా?

image

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జనవరి 13వ తేదీని మూవీ టీమ్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలాఖరులోగా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఈ ఏడాది అక్టోబర్/ నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.