News June 2, 2024
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత బాక్సర్లు

భారత బాక్సర్లు జైస్మిన్ లంబోరియా, అమిత్ పంఘల్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. బ్యాంకాక్లో జరుగుతున్న వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ పురుషుల క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ లియు చువాంగ్పై అమిత్ విజయం సాధించారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్లో మరైన్ కమరాను 5-0 తేడాతో జైస్మిన్ చిత్తు చేశారు. దీంతో వీరిద్దరూ పారిస్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. కాగా ఈ ఒలింపిక్స్ జులై 26న ప్రారంభం కానున్నాయి.
Similar News
News September 18, 2025
‘మార్కో’ సీక్వెల్కు ఉన్ని ముకుందన్ దూరం!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మార్కో’కు సీక్వెల్ రానుంది. ‘లార్డ్ మార్కో’గా రానున్న ఈ చిత్రంలో హీరోగా ఉన్ని ముకుందన్ నటించట్లేదని సినీ వర్గాలు తెలిపాయి. వేరే హీరోతో ఈ మూవీని తెరకెక్కిస్తారని పేర్కొన్నాయి. ‘మార్కో’పై వచ్చిన నెగిటివిటీ కారణంగా పార్ట్-2 చేసేందుకు ఆసక్తి లేదని గతంలోనే ఉన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’లో లీడ్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<