News June 3, 2024

పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ: వర్మ

image

జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత, పిఠాపురం  కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ ఖాయమని మాజీ MLA ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం మండలం కోలంకలో పర్యటించిన ఆయన గాజుగ్లాసులో టీ తాగి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలన్నీ కూటమిదే విజయమని చెప్పాయన్నారు. అలాగే, పవన్ గెలుపు కూడా ఖాయమని చెప్పినట్లు గుర్తుచేశారు.

Similar News

News July 5, 2025

రాజమండ్రిలో మహిళ హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు

image

రాజమండ్రికి చెందిన మహిళ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. 2013 డిసెంబర్ 2న లక్ష్మీవారపు పేటకు చెందిన నాగభారతిని మహేశ్‌, లక్ష్మణరావు, మరో వ్యక్తి బంగారం కోసం హత్య చేశారు. మహిళ భర్త ప్రసాదరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాదనలు విన్న పదో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు కమ్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఉమశునంద ముగ్గురు హత్య చేశారని నిర్ధారించి శుక్రవారం తీర్పు చెప్పారు.

News July 5, 2025

పీఎం ఫసల్ బీమా యోజన నమోదు ప్రక్రియ ప్రారంభం

image

పీఎం ఫసల్ బీమా యోజన సార్వా పంటకు నమోదు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DAO ఎస్ మాధవరావు తెలిపారు. జిల్లాలో వరి, మినుము, అరటిపంటను నోటిఫై చేసినట్లు వివరించారు. వరి ఎకరాకు రూ.570, మినుము రూ.300, అరటి ఎకరాకు రూ.3వేల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. ఆగస్టు 15 వరకు మినుము, ఈనెల 15లోపు అరటి పంటకు ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. రైతులు ఈ-క్రాఫ్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.

News May 8, 2025

తూ.గో: అవార్డు అందుకున్న కలెక్టర్

image

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆంధ్రపదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా ప్రశంపా పత్రం స్వీకరించారు. 2022-23 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఇండియన్ రెడ్‌ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం కోసం చేసిన కృషిని గుర్తింపు లభించింది.