News June 3, 2024
HYD: సీఎం రేవంత్ రెడ్డి మనవడితో సరదాగా గవర్నర్

సీఎం రేవంత్ రెడ్డి మనవడితో గవర్నర్ రాధాకృష్ణన్ కొద్దిసేపు సరదాగా గడిపారు. HYD ట్యాంక్ బండ్ వద్ద రాత్రి జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో స్టేజీపై తన మనవడిని సీఎం గవర్నర్కు పరిచయం చేశారు. ఈ సమయంలో గవర్నర్ ఆ చిన్నారికి రెండు నోట్లను ఇచ్చారు. దీంతో ఆ బాలుడు వద్దన్నట్లుగా ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చాడు. అయినా గవర్నర్ మరోసారి ఆ నోట్లను చిన్నారికి ఇస్తూ జేబులో పెట్టడంతో సీఎం నవ్వుతూ చూశారు.
Similar News
News January 27, 2026
JBS TO మేడారం.. DAY/NIGHT బస్సులు

మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే నగరవాసులకు శుభవార్త. సికింద్రాబాద్ JBS నుంచి వన జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మేనేజర్ ఎల్.రవీందర్ తెలిపారు. రేపటి నుంచి జనవరి 31 వరకు 24 గంటల పాటు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్లాట్ఫాం నంబర్ 13 వద్ద బస్సులు ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని జంట నగరాల ప్రయాణికులు గమనించి, ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT
News January 27, 2026
HYDలో JAN 30న ఈ షాపులు బంద్

మహాత్మా గాంధీ వర్ధంతి(JAN 30)ని పురస్కరించుకొని నగరంలోని బీఫ్, గొర్రెలు, మేకల కబేళాలు, మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC ఆదేశించింది. స్టాండింగ్ కమిటీ తీర్మానం ప్రకారం GHMC చట్టం 1955లోని సెక్షన్ 533 (b) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అధికారులు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని, మాంసం దుకాణాల యజమానులు, ప్రజలు సహకరించాలని GHMC విజ్ఞప్తి చేసింది.
SHARE IT
News January 27, 2026
TDR లెక్కలు–గణాంకాలు ఇలా ఉన్నాయి!

ప్రస్తుతం సిటీలో TDR లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,585 TDR సర్టిఫికేట్లను జారీ చేశారు. వీటి ద్వారా సుమారు 1,070 ఎకరాల భూమి TDR రూపంలో నమోదైంది. అందులో 712 ఎకరాలను ఇప్పటికే వివిధ నిర్మాణాల కోసం వాడేశారు. ప్రస్తుతం మార్కెట్లో మరో 316 ఎకరాల వరకు TDR నిల్వలు అందుబాటులో ఉన్నాయి. చెరువుల FTL భూములకు సంబంధించి TDR ఇచ్చే ముందు ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల నుంచి క్లియరెన్స్ తప్పనిసరి.


