News June 3, 2024

ORRపై పెరిగిన టోల్‌ఛార్జీలు

image

HYD ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్‌ఛార్జీలు 5% పెరిగాయి. వాహనాలను బట్టి ఆరు కేటగిరీలుగా విభజించగా.. కారు, జీపు, వ్యాను, ఎల్ఎంవీ, ఎస్వీయూ వాహనాలకు ప్రతి కి.మీకి రూ.2.34, ఎల్‌సీవీ, మినీ బస్సుకు రూ.3.77, బస్సు, 2 యాక్సిల్ ట్రక్కుకు రూ.6.69, 3 యాక్సిల్ వాణిజ్య వాహనాలకు రూ.8.63, భారీ నిర్మాణ యంత్రాలు-4,5,6 యాక్సిల్ ట్రక్కులకు రూ.12.40, ఏడు అంతకంటే ఎక్కువ యాక్సిల్ ఉండే వాహనాలకు కి.మీకు ₹15.09 వసూలు చేస్తారు.

Similar News

News September 17, 2025

కేరళలో PAM కలకలం.. 19 మంది మృతి

image

కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(PAM) అనే ప్రాణాంతక వ్యాధి కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 61 కేసులు, 19 మరణాలు సంభవించాయి. క్లోరినేషన్ సరిగా లేని నీటిలో ఉండే నేగ్లేరియా ఫౌలెరీ(మెదడును తినే) అమీబా వల్ల ఇది వ్యాపిస్తుంది. ఈత/స్నానం సమయంలో నీటి ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సోకితే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

News September 17, 2025

ASIA CUP: పాక్-UAE మ్యాచ్ రిఫరీగా పైక్రాఫ్ట్

image

తమ మ్యాచ్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలన్న పాక్‌కు ICC షాక్ ఇచ్చింది. పాక్-UAE మ్యాచ్‌కు అతడినే రిఫరీగా కొనసాగిస్తోంది. మరోవైపు హ్యాండ్ షేక్ వివాదంపై పైక్రాఫ్ట్ తాజాగా తమకు క్షమాపణ చెప్పాడని పీసీబీ క్లెయిమ్ చేసుకోవడం గమనార్హం. అటు మ్యాచులో పాక్‌కు UAE షాక్ ఇస్తోంది. తొలి ఓవర్‌లో ఓపెనర్ అయూబ్‌ను డకౌట్‌గా వెనక్కి పంపింది. పాక్ 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది.

News September 17, 2025

హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్‌కౌంటర్

image

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. UPలోని ఘజియాబాద్‌లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.