News June 3, 2024

ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ముకేశ్ కుమార్ మీనా

image

APలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని వివరించారు.

Similar News

News December 26, 2025

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌(<>EIL<<>>) 5 మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్/బీఎస్సీ(Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. మేనేజర్‌కు నెలకు రూ.80వేలు-రూ.2,20000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.70వేలు-రూ.2లక్షలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.eil.co.in

News December 26, 2025

మెదడు దగ్గరి భాగాల్లో కుక్క కరిస్తే డేంజర్!

image

కుక్క కాటు వేసిన 14 రోజుల తర్వాత రేబిస్ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపిస్తే దాదాపు మరణం ఖాయమని, అందుకే కాటు వేసిన వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మెదడుకు దగ్గరగా ఉండే తల, ముఖం, మెడ భాగాల్లో కరిస్తే చాలా డేంజర్ అని, దీనివల్ల రేబిస్ వైరస్ వేగంగా మెదడును చేరుతుందని తెలిపారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లతో పాటు Rabies Immuno-globulin (RIG) కచ్చితంగా తీసుకోవాలంటున్నారు.

News December 26, 2025

రెండు కేటగిరీల్లో నోబెల్.. రేడియేషన్‌తో మృతి

image

రెండు సైంటిఫిక్ కేటగిరీల(ఫిజిక్స్ (1903), కెమిస్ట్రీ (1911))లో నోబెల్ సాధించిన ఒకేఒక్కరు మేరీ క్యూరీ. ఆమె భర్త పియరీ క్యూరీతో కలిసి 127ఏళ్ల క్రితం ఇదే రోజు రేడియం, పొలోనియం కనుగొన్నారు. ఒట్టి చేతులతో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్‌ పట్టుకోవడంతో వారు ఉపయోగించిన వస్తువులకూ వ్యాపించాయి. రేడియేషన్ కారణంగా బోన్ మేరో బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేయలేకపోవడంతో అప్లాస్టిక్ అనీమియా వచ్చి మేరీ 1934లో మరణించారు.