News June 3, 2024
తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు?
TG సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. CM కాన్వాయ్ ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చేది. ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి లోపలికి, నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక సౌత్ ఈస్ట్ నుంచి అధికారుల రాకపోకలు సాగనున్నాయట. గతంలో ఆరో అంతస్తులో ఉన్న CM ఆఫీసును 9వ అంతస్తులోకి మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 10, 2024
కాసేపట్లో వర్షం
TGలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. యాదాద్రి, వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట, సిరిసిల్ల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, MBNR, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, వనపర్తి, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
News October 10, 2024
రతన్ టాటా వారసుడు ఎవరు?
రతన్ టాటా మరణంతో ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. రతన్కు పిల్లలు లేకపోవడంతో ట్రస్ట్లో వాటా ఎవరికి దక్కుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన సవతితల్లి కుమారుడు నోయెల్ టాటా పిల్లలు మాయ, నెవిల్లే, లేహ్ అందుకు అర్హులనే చర్చ నడుస్తోంది. వీరంతా ప్రస్తుతం టాటా సంస్థలోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరే టాటా సామ్రాజ్యానికి కాబోయే అధిపతులని విశ్లేషకులు భావిస్తున్నారు.
News October 10, 2024
రతన్ టాటాకు ‘భారతరత్న’ ఇవ్వాలని MH ప్రభుత్వం తీర్మానం!
దివంగత రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇవాళ నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. దేశ పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా గొప్ప మానవతావాది అయిన రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?